టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే

ABN , First Publish Date - 2020-09-23T07:16:06+05:30 IST

తెలుగు సినీ పరిశ్రమలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే ఉంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే

హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలుగు సినీ పరిశ్రమలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు ఇంకా పరిశోధనలోనే ఉంది. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద చేసిన దరఖాస్తుకు సమాధానం గా రాష్ట్ర ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ శాఖ ఈ విషయం తెలిపింది.

2017 జూన్‌లో ఎక్సైజ్‌ అధికారులు రాష్ట్రంలో డ్రగ్స్‌ దందా ను బయటపెట్టి.. అప్పటి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలో కేసును పరిశోధించిన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ సరఫరాదారు కెల్వి న్‌ మస్కరెన్హా్‌సను అరెస్టు చేసి అతని కాల్‌డేటా ఆధారంగా శోధించగా పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి.

Updated Date - 2020-09-23T07:16:06+05:30 IST