మానవ చరిత్రలో అతి కష్టమైన యుద్ధం: అమిత్ షా

ABN , First Publish Date - 2021-01-16T23:10:42+05:30 IST

దేశ వ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ‘‘యేడాది కాలంగా దేశం కోవిడ్-19తో పోరాడుతోంది. చాలా మంది ప్రజలు చనిపోయారు. ప్రపంచ మానవ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన యుద్ధం

మానవ చరిత్రలో అతి కష్టమైన యుద్ధం: అమిత్ షా

బెంగళూరు: కోవిడ్-19తో యుద్ధం మానవ చరిత్రలో అతి కష్టమైనదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రపంచం మొత్తం యేడాదిగా ఈ యుద్ధం చేస్తోందని అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కోవిడ్‌పై విజయవంతమైన యుద్ధం చేస్తున్నట్లు ఆయన అన్నారు. శనివారం కర్ణాటక రాష్ట్రంలోని భద్రావతిలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రానికి పునాది రాయి వేయడానికి అమిత్ షా వచ్చారు.


దేశ వ్యాప్తంగా ఈరోజు కోవిడ్-19 టీకా డ్రైవ్ ప్రారంభమైన సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ‘‘యేడాది కాలంగా దేశం కోవిడ్-19తో పోరాడుతోంది. చాలా మంది ప్రజలు చనిపోయారు. ప్రపంచ మానవ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన యుద్ధం చేస్తున్నాం. కానీ నేను మీతో ఒక విషయాన్ని ఆనందంగా చెప్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మనం కోవిడ్-19పై యుద్ధం గెలవబోతున్నాం. పూర్తి స్వదేశీయైన రెండు వ్యాక్సీన్లతో ఈ కరోనా యుద్ధాన్ని ముగింపుకు తీసుకువెళ్లామని భారత ప్రజలందరికీ నేను ఎంతో సంతోషంతో తెలియజేస్తున్నాను’’ అని అన్నారు.

Updated Date - 2021-01-16T23:10:42+05:30 IST