హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ

ABN , First Publish Date - 2022-01-28T03:54:59+05:30 IST

హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ

హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ

అమరావతి: శుక్రవారం రోజు ఏపీ హైకోర్టులో మూడు రాజధానుల కేసుల విచారణ జరగనుంది. శుక్రవారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ ప్రారంభం కానుంది. మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ మళ్లీ ప్రవేశపెడతామని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తమ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని రైతుల తరుపు లాయర్లు కోరుతున్నారు. ఏ అంశాలపై విచారించాలో అఫిడవిట్లు వేయాలని హైకోర్టు గతంలో కోరింది. ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. కరోనాతో థర్డ్ వేవ్ విజృంభించడంతో హైకోర్టులో వర్చువల్ విచారణ జరగనుంది.

Updated Date - 2022-01-28T03:54:59+05:30 IST