ప్రమాదాల మలుపు

ABN , First Publish Date - 2021-01-17T04:53:48+05:30 IST

మండల పరిధిలోని ఆరికతోట జాతీయ రహదారిపై ఉన్న మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రహదారిని విస్తరించకపోవడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రమాదాల మలుపు
ఆరికతోట వద్ద ఉన్న ప్రమాదకర మలుపు

రామభద్రపురం: మండల పరిధిలోని ఆరికతోట జాతీయ రహదారిపై ఉన్న మలుపు ప్రమాదాలకు నిలయంగా మారింది.  ఎన్నో ఏళ్ల కిందట నిర్మించిన ఈ రహదారిని విస్తరించకపోవడంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల  ఆ మలుపు వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ ఏర్పాటు చేశారు. అయిన ప్పటికీ ఈ మలుపు వద్ద  వాహన చోదకులు జాగ్రత్తగా వాహనాన్ని నడుపుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనబడకపోవడంతో మలుపు ఉన్నదీ కూడా తెలియరావడం లేదని పలువురు తెలి పారు. దీనిపై అప్పట్లో ఆర్‌అండ్‌బీ అధికారులు సర్వేచేసి మలుపును తొలగించడానికి చర్యలు చేపట్టారు. కానీ ఆ ప్రయత్నాలు విరమించుకొని స్పీడ్‌ బ్రేకర్‌తోనే సరి పెట్టుకున్నారు. అసలు ఈ  హైవే గుండా నిత్యం ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఏపీలకు చెందినవేలాది లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి.  ఈనేపథ్యంలో     సంబంధిత అధికారులు స్పందించాలని వాహనచోదకులు కోరుతున్నారు. 

 

Updated Date - 2021-01-17T04:53:48+05:30 IST