రాజ్యాంగానిదే అంతిమ విజయం : కిడారి శ్రావణ్కుమార్
ABN , First Publish Date - 2021-01-27T06:36:17+05:30 IST
రాజకీయానికి, రాజ్యాంగానికి జరిగిన పోరులో అంతిమ విజయం రాజ్యాంగానిదేనని మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ అన్నారు.
అరకులోయ, జనవరి 26: రాజకీయానికి, రాజ్యాంగానికి జరిగిన పోరులో అంతిమ విజయం రాజ్యాంగానిదేనని మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పుతో రాజ్యాంగానిదే విజయం అయ్యిందన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి అబ్రహం, దొన్నుదొర, శెట్టి బాబూరావు, మహాదేవ్, పాండురంగస్వామి, సుబ్బారావు పాల్గొన్నారు.