మాస్కుల వాడకం తప్పనిసరి : ఎస్‌ఐ

ABN , First Publish Date - 2020-08-04T10:45:08+05:30 IST

మండలంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు అన్నారు.

మాస్కుల వాడకం తప్పనిసరి : ఎస్‌ఐ

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 3 : మండలంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు వాడాలని గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు అన్నారు. సోమవారం ఆయన స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు  భౌతికదూరం తప్పకుండా పాటించాలన్నారు. ఎవరైన మాస్కులు లేకుండా తిరిగితే వారికి రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. షాపులకు మాస్కులు లేకుండా వచ్చే వారికి సరుకులు ఇవ్వవద్దని వ్యాపారులకు సూచించారు.

Updated Date - 2020-08-04T10:45:08+05:30 IST