తిరుమల ఘాట్లో వ్యాను బోల్తా
ABN , First Publish Date - 2021-03-08T08:04:04+05:30 IST
తిరుమల మొదటి ఘాట్లో ఆదివారం ఓ వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది.
తమిళనాడు భక్తులకు స్వల్పగాయాలు
తిరుమల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తిరుమల మొదటి ఘాట్లో ఆదివారం ఓ వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనం ముగించుకుని ఆదివారం రాత్రి వ్యానులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గంలోని చివరి మలుపు వద్దకొచ్చేసరికి వాహనం అదుపుతప్పి క్రాష్ బ్యారియర్పై బోల్తా పడింది. దీంతో వాహనంలో ఐదుగురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వెనుక వస్తుండిన వాహనదారులు బోల్తాపడిన వాహనం నుంచి వెంటనే భక్తులను వెలుపలకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించారు. తర్వాత వ్యానును రోడ్డు పక్కకు తొలగించి, ట్రాఫిక్ సమస్య లేకుండా సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకున్నారు.