అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయం
ABN , First Publish Date - 2022-03-14T04:25:08+05:30 IST
అన్నివర్గాల సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఆదివారం స్థానికఒడ్డెపల్లి గార్డెన్లో టీఆర్ ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కుతో కలిసి మండల పరిధిలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు చీరలను పంపిణీ చేశారు.
- జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
ఆసిఫాబాద్రూరల్, మార్చి 13: అన్నివర్గాల సంక్షే మమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి అన్నారు. ఆదివారం స్థానికఒడ్డెపల్లి గార్డెన్లో టీఆర్ ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కుతో కలిసి మండల పరిధిలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియో జకవర్గాలలోని 753మంది ఆశా వర్క ర్లకు చీరలను పంపిణీ చేస్తామన్నారు. గతరెండు సంవత్సరాలుగా కరోనా నియంత్రణలో ఆశా వర్కర్లు ప్రముఖపాత్ర పొషించారన్నారు. ఎం పీపీ అరిగెల మల్లిఖార్జున్ యాదవ్, మార్కెట్కమిటీ ఛైర్మన్ గాదవేణి మల్లేష్, పీఏసీఎస్ ఛైర్మన్ అలీబీన్ ఆహ్మద్, డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్నాయక్, వైద్యాధికారి సత్యనారాయణ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాగజ్నగర్: కాగజ్నగర్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఆదివారం ఎమ్మెల్యే కోనేరుకోనప్ప యూని ఫాం, చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశల వారీగా సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, ఎమ్మెల్యే సతీమణి కోనేరు రమాదేవి కౌన్సిలర్లు పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే కోనప్పను ఆశా వర్కర్లు ఘనంగా సన్మానించారు.