రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2021-04-21T05:41:04+05:30 IST
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభు త్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు.
- పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
ఎలిగేడు, ఏప్రిల్ 20 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభు త్వం పనిచేస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు నర్సాపూర్ గ్రామాల్లో మంగళవారం సింగివిండో ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం అమ్మకాల్లో దళా రులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకుని మద్దతు ధరను పొందాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏవిధంగా ఉన్నప్పటికి తమ ప్రభు త్వం మాత్రం రైతుల మేలుకోరే విధంగా పనిచేస్తోందన్నారు. ధాన్యం కొను గోలు కేంద్రల్లో కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్పర్సన్ మండిగ రేణుక, ఎంపీపీ స్రవంతి, విండో చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీ డీఓ శ్రీనివాసమూర్తి, వ్యవసాయ అధికారి ఉమాపతి, వైస్ఎంపీపీ బుర్ర వీరస్వామిగౌడ్, సర్పంచులు సంధూజ, స్వప్న, కొండల్రెడ్డి, ఐలయ్య, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్రావు, బైరెడ్డి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.