పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2021-10-22T05:12:45+05:30 IST

పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి, అక్టోబరు 21: పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో పలువురికి చెక్కులు పంపిణీ చేశారు. కోరుట్ల మండలం యూస్‌ఫ్‌నగర్‌ గ్రామానికి చెందిన రైతు రుద్రవేణి రవి అనారోగ్యంతో గత నెల మరణించిగా వారి కుటుంబ సభ్యులకు రైతు బీమా కింద 5 లక్షల విలువ గల చెక్కును భార్య భాగ్యకు అందజేశారు. అదే విధంగా మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి గంగాధర్‌కు 36 వేల ిసీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు మారు సాయిరెడ్డి, తోట నారయణ, సర్పంచ్‌ పీసు తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ గుగ్గిల ప్రియాంక-సురేష్‌గౌడ్‌, జావిద్‌, రాజగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T05:12:45+05:30 IST