హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యం
ABN , First Publish Date - 2021-05-14T05:19:05+05:30 IST
హత్యకు గురైన మహిళ ఆచూకీ లభ్యం
ఘట్కేసర్ రూరల్ : ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈనెల 9న గుర్తుతెలియని మహిళ అత్యాచారం, హత్య కేసులో ఘట్కేసర్ పోలీసులు పురోగతి సాధించారు. కాగా పోచారం మునిసిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ బాలాజీ ట్రేడర్స్ భవనంపై ఈనెల 9న గుర్తుతెలియని(39) వయసు గల మహిళా మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా మృతదేహం పక్కన పోలీసులు మద్యం సీసాలను గుర్తించారు. గుర్తుతెలియని మహిళగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో సదరు మహిళా ఓయూ ప్రాంతంలోని మానికేశ్వరీనగర్కు చెందిన ఒర్సు లలిత(39)గా గుర్తించారు. కాగా ఆమె కూలీ పనులు చేసుకుంటుందని, ఆమె ఫొటో ఆధారంగా అన్నోజిగూడకు ఎందుకు వచ్చింది? ఎవరితో వచ్చింది? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు. త్వరలో కేసును చేధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సీఐ తెలిపారు.