మా అమ్మకు బాలేదు.. రెండ్రోజుల్లో వస్తానన్న భార్య.. కోపంతో ఆమె చేతిల్లోని 8 నెలల కూతుర్ని లాక్కుని.. నేలకేసి..

ABN , First Publish Date - 2021-08-02T18:37:02+05:30 IST

అతడు మద్యానికి బానిస.. భార్యతో తరచుగా గొడవలే.. తాగేసి వచ్చి ఆమెను ఎప్పుడూ కొడుతుండేవాడు..

మా అమ్మకు బాలేదు.. రెండ్రోజుల్లో వస్తానన్న భార్య.. కోపంతో ఆమె చేతిల్లోని 8 నెలల కూతుర్ని లాక్కుని.. నేలకేసి..

అతడు మద్యానికి బానిస.. భార్యతో తరచుగా గొడవలే.. తాగేసి వచ్చి ఆమెను ఎప్పుడూ కొడుతుండేవాడు.. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత శనివారం ఆమె ఎనిమిది నెలల కూతుర్ని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.. అదే రోజు అక్కడకు వెళ్లిన భర్త భార్యతో గొడవపడ్డాడు.. క్షణికావేశానికి గురై ఆమె చేతిలో నుంచి 8 నెలల కూతుర్ని లాక్కుని నేలకేసి కొట్టాడు.. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది.. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగింది. 


మొరాదాబాద్‌కు చెందిన నజీమ్‌కు గతేడాది మహ్తాబ్‌తో వివాహం జరిగింది. వీరికి 8 నెలల కూతురు ఉంది. మద్యానికి బానిసైన నజీమ్ తరచుగా తాగేసి ఇంటికి వచ్చి భార్యను కొడుతుండేవాడు. కూతురి కాపురం గురించి బెంగపెట్టుకోవడం వల్ల మహ్తాబ్ తల్లి ఆరోగ్యం పాడైంది. దీంతో తల్లిని చూసేందుకు శనివారం ఉదయం మహ్తాబ్ 8 నెలల కూతురిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం భార్య కోసం నజీమ్ కూడా అక్కడకు వెళ్లాడు. 


మద్యం సేవించి ఉన్న నజీమ్ భార్యను ఇంటికి వచ్చెయ్యమని అడిగాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆమె అందుకు నిరాకరించింది. తల్లి ఆరోగ్యం నయమయ్యాక రెండ్రోజుల్లో వస్తానని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన నజీమ్.. భార్య చేతుల్లో ఉన్న 8 నెలల కూతురిని నేలకేసి కొట్టాడు. వెంటనే ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తెసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ ఆ చిన్నారి మరణించింది. మహ్తాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజీమ్‌ను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-08-02T18:37:02+05:30 IST