అర్ధరాత్రి అయినా రాని భర్త.. ఫోన్ చేసిన భార్య.. ఇంటి బయటే ఫోన్ రింగ్ కావడంతో తలుపు తీసి చీకట్లోనే గోడ దగ్గరకు వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2021-10-28T01:59:39+05:30 IST

బీతల్‌కు చెందిన యోగేష్ డోంగ్రే అనే యువకుడు మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తుంటాడు. గత శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొని మద్యం సేవించాడు. అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నాడు. బైక్‌ను పార్క్ చేసి నోట్లోని గుట్కాను ఊసేయడానికి ప్రహరీ వద్దకు వెళ్లాడు.

అర్ధరాత్రి అయినా రాని భర్త.. ఫోన్ చేసిన భార్య.. ఇంటి బయటే ఫోన్ రింగ్ కావడంతో తలుపు తీసి చీకట్లోనే గోడ దగ్గరకు వెళ్లి చూస్తే..

చావు ఎప్పుడు.. ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటివరకు బాగున్న వ్యక్తులు.. ఉన్నట్టుండి తనువు చాలించడం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి మృత్యువు వొడిలోకి వెళ్లి.. మళ్లీ బతికి బట్టకట్టిన సందర్భాలూ ఉంటాయి. కొందరు చనిపోవడం చూస్తే.. ఆశ్చర్యంగానూ, నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని బీతల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..


బీతల్‌కు చెందిన యోగేష్ డోంగ్రే అనే యువకుడు మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా పనిచేస్తుంటాడు. గత శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొని మద్యం సేవించాడు. అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నాడు. బైక్‌ను పార్క్ చేసి నోట్లోని గుట్కాను ఊసేయడానికి ప్రహరీ వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారడంతో వెళ్లి ఇనుప ఊచల మధ్యలో చిక్కుకున్నాడు. తల లోపల ఇరుక్కోవడంతో ఊపిరాడలేదు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో చాలా సేపు విలవిల్లాడి.. చివరకు ప్రాణాలను వదిలాడు. భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య కాల్ చేసింది. అయితే ఫోన్ రింగ్ వినపడడంతో బయటకు వచ్చింది.


బయట ఇనుప ఊచల మధ్యలో విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. అతి కష్టం మీద అతన్ని బయటికి తీశారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఉన్నట్టుండి జరిగన ఈ ఘటనతో స్థానికంగా విషాధ ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-10-28T01:59:39+05:30 IST