ఇప్పుడు పని ఉంది.. రెండ్రోజుల తర్వాత మీ పుట్టింటికి వెళ్దాం.. అని భర్త చెప్పడంతో ఏడు నెలల కూతురితో సహా ఆ భార్య చేసిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-10-27T22:45:11+05:30 IST

సంసారంలో సమస్యలు తలెత్తడం మామూలే. కానీ వాటిని సామరసర్యంగా పరిష్కరించుకోవాలి. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు పని ఉంది.. రెండ్రోజుల తర్వాత మీ పుట్టింటికి వెళ్దాం.. అని భర్త చెప్పడంతో ఏడు నెలల కూతురితో సహా ఆ భార్య చేసిన దారుణమిది..!

సంసారంలో సమస్యలు తలెత్తడం మామూలే. కానీ వాటిని సామరసర్యంగా పరిష్కరించుకోవాలి. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న సమస్యలకు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. పుట్టింటికి తీసుకెళ్లడం ఆలస్యమవుతుందని చెప్పడంతో ఆ భార్య చేసిన పని.. సంచలనం కలిగించింది. కర్ణాటక సరిహద్దులోని తమిళనాడు జిల్లా కేలమంగళంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన సమస్యలు చివరకు ఎంత వరకు వెళ్లాయంటే..


కేలమంగళం జిల్లా అంచెట్టి తాలూకా మేటుకొటాయ్ గ్రామానికి చెందిన వెంకటేశ్‌, దీప దంపతులు. వీరికి ఏడు నెలల పాప ఉంది.  కొన్నాళ్లు సవ్యంగా సాగిన వారి సంసారంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో గతంలో దీప ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పురుగుల మందు తాగడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే అప్పటి నుంచి కొన్నాళ్ల వరకు ఆ దంపతులు దూరంగా ఉండేవారు. కొన్ని నెలలకు భార్యను మళ్లీ కాపురానికి తీసుకెళ్లాడు.


అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ సమస్యలు మొదలయ్యాయి. దీంతో తనను పుట్టింటికి తీసుకెళ్లాలని భార్య కోరింది. అయితే కొంచెం పని ఉందని, రెండు రోజుల తర్వాత తీసుకెళ్తానని భర్త చెప్పాడు. ఈ మాటతో భార్యకు విపరీతమైన కోపం వచ్చింది. తన ఏడు నెలల చిన్నారితో కలిసి ఇంటి సమీపంలోని బావిలో దూకేసింది. ఇంటికి వచ్చిన భర్తకు.. ఎవరూ కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించగా బావిలో మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేసి బావిలో పడేశారని దీప బంధువులు ఆరోపించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-27T22:45:11+05:30 IST