భర్తను హత్య చేసిన భార్య

ABN , First Publish Date - 2021-05-16T05:59:19+05:30 IST

పట్టణంలోని కృష్ణాపురం తొమ్మిదో రోడ్డులో నివాసముంటున్న మసూద్‌ (34) శనివారం రాత్రి భార్య చే తిలో హతమయ్యాడు.

భర్తను హత్య చేసిన భార్య
మృతుడు మసూద్‌

తాడిపత్రి, మే 15: పట్టణంలోని కృష్ణాపురం తొమ్మిదో రోడ్డులో నివాసముంటున్న మసూద్‌ (34) శనివారం రాత్రి భార్య చే తిలో హతమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. మసూద్‌, మసూద్‌ బీ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు.  పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవా డు. మద్యానికి బానిసైన మసూద్‌ తరచూ భార్యతో పాటు పిల్లలు, తల్లిదండ్రులను చావబాదేవాడు. ఈక్రమంలో రాత్రి తాగిన మైకంతో విచక్షణారహితంగా కొడుతుండటంతో భార్య భరించలేకపోయింది. భర్త చిత్రహింసలకు వేసారిన ఆమె ఆగ్రహంతో భర్త తలపై రోకలి బండతో బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు  కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-16T05:59:19+05:30 IST