మిద్దె పై నుంచిజారిపడి మహిళ మృతి

ABN , First Publish Date - 2021-07-30T04:51:35+05:30 IST

ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి జారిపడి ఎ.వెంకటసుబ్బమ్మ (38) అనే మహిళ మృతి చెందింది.

మిద్దె పై నుంచిజారిపడి మహిళ మృతి
మృతి చెందిన వెంకటసుబ్బమ్మ

రైల్వేకోడూరు రూరల్‌, జూలై 29: ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి జారిపడి ఎ.వెంకటసుబ్బమ్మ (38) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు బంధువులు అందించిన వివరాల మేరకు పట్టణంలోని న్యూక్రిష్ణనగర్‌లో నివాసముంటున్న లోకనాఽథం భార్య వెంకటసుబ్బమ్మ మేడ మీద బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు గురువారం కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త లోకనాథం పట్టణంలో బార్బర్‌ షాప్‌ నిర్వహిస్తుంటాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ పెద్ద ఓబన్న తెలిపారు. 

Updated Date - 2021-07-30T04:51:35+05:30 IST