భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న మహిళ మృతి
ABN , First Publish Date - 2022-01-07T00:16:52+05:30 IST
భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న మహిళ మృతి
కరీంనగర్: భర్త ఇంటి ఎదుట దీక్ష చేస్తున్న మహిళ సుహాసిని మృతి చెందింది. 40 రోజులుగా దీక్ష చేసి ఆత్మహత్య చేసుకునేందుకు ఆమె ప్రయత్నించింది. ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. తన చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. తన అవయవాలు దానం చేయాలని మృతురాలు పేర్కొంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుహాసిని మృతి చెందింది. మృతురాలు సుహాసిని కడప జిల్లా వాసిగా గుర్తించారు.