రాష్ట్రంలో వైసీపీ పిచ్చిపాలన..!

ABN , First Publish Date - 2020-02-23T06:45:46+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ పిచ్చిపాలన సాగుతోందని, ఎప్పుడు రేషన్‌కార్డు రద్దు అవుతుందో, పింఛన్‌ నిలిచిపోతుందో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారని మాజీ

రాష్ట్రంలో వైసీపీ పిచ్చిపాలన..!

మాజీ హోం మంత్రి చినరాజప్ప


డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), ఫిబ్రవరి22: రాష్ట్రంలో వైసీపీ పిచ్చిపాలన సాగుతోందని, ఎప్పుడు రేషన్‌కార్డు రద్దు అవుతుందో, పింఛన్‌ నిలిచిపోతుందో తెలియని స్థితిలో ప్రజలు ఉన్నారని మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే  చినరాజప్ప ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాన్ని ఎలా అణగదొక్కాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనపై సిట్‌ వేయడం, చంద్రబాబును అవినీతిపరుడనడం అందులో భాగమేనన్నారు. అచ్చెన్నాయుడు బలమైన నాయకుడిగా ఉండడం వల్ల ఆయనపై కక్షసాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించా రు.


ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పేదల భూములు లాక్కుంటున్నారని, ఇసుకను దోచుకుంటున్నారని, ఎవరైనా నోరు విప్పితే వారిపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.8కోట్ల నిధులతో తన నియోజకవర్గంలో రోడ్డు వేస్తే వాటిని పగులగొట్టి కక్ష తీర్చుకుంటున్నారన్నారు. మద్యం సరఫరాలో అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజల ఆరోగ్యం గుల్లవుతోందన్నారు. అలాగే సారా ప్రభావం పెరిగి పోయిందని రాజప్ప ఆరోపించారు. సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగసూర్యనారాయణ, పార్టీ మైనారిటీ నాయకుడు జహరుద్దీన్‌ జిలాని పాల్గొన్నారు.

Updated Date - 2020-02-23T06:45:46+05:30 IST