వైసీపీ నాయకుడి ఇంట్లో పేకాట
ABN , First Publish Date - 2021-04-19T10:05:03+05:30 IST
వైసీపీ నాయకుడి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్ఈబీ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో
- 30 మంది అరెస్టు..
- రూ.6.23 లక్షలు స్వాధీనం
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 18 : వైసీపీ నాయకుడి ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్ఈబీ పోలీసులు దాడి చేసి 30 మందిని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం ఈ దాడి నిర్వహించారు. తొమ్మండ్రు వీధిలోని వైసీపీ నాయకుడు సింగం భరత్రెడ్డి ఇంట్లో పేకాడుతున్న 30 మందిని అరెస్టు చేశామని ఎస్ఈబీ సీఐ సుదర్శన్రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.6.23 లక్షల నగదు, మూడు కార్లు, మూడు మో టార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిచారు. పట్టుబడినవారిలో క డప జిల్లా ప్రొద్దుటూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల పట్టణాల నుంచి వ చ్చిన వారున్నారని తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ముగ్గురు వై సీపీ నాయకులనూ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పేకాటలో డబ్బుకు బదులుగా టోకెన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని, టోకెన్ల విలువను బట్టి గెలిచినవారికి డబ్బు చెల్లిస్తున్నారని సీఐ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.