గుంతలో పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-06-22T05:41:02+05:30 IST
మంచిప్ప రిజర్వాయర్ పైపు లైను కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం రామడుగు గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది.
సిరికొండ జూన్ 21 : మంచిప్ప రిజర్వాయర్ పైపు లైను కోసం తవ్విన గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన సిరికొండ మండలం రామడుగు గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఎర్రోల్ల ప్రేమానందం(28) అనే యువకుడు టీ తాగి పొలం వద్దకు వెళ్లి వస్తానని బయలుదేరాడు. పొలానికి వెళ్తుండగా ప్రమాద వశాత్తు గుంతలో పడ్డాడు. గుంత బురదమయంగా ఉండడంతో అందులో కూరుకుపోయి మృతి చెందాడు. దీనికి గమనించిన ఇతర రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లి భూదెవ్వ ఇతర కుటుంబ సభ్యులు సంఘటన వెళ్లి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్సై రాజశేఖర్ శవ పంచనామా చేసి పోస్టుమార్టం కోసం శవాన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. భూదెవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చి వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.