చెరువులో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-21T06:12:51+05:30 IST

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.

చెరువులో పడి యువకుడి మృతి

హత్నూర, జనవరి 20: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు.  హత్నూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాదుల్లానగర్‌ గ్రామానికి చెందిన నీరుడి సుధాకర్‌(18) మంగళవారం సాయంత్రం స్నేహితుడితో కలిసి తుర్కలఖానాపూర్‌ శివారులోని శెట్టి చెరువులో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడడంతో మృతి చెందాడు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-01-21T06:12:51+05:30 IST