యువతి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-10-03T21:04:21+05:30 IST

వికారాబాద్ జిల్లాకు చెందిన రమ్యకృష్ణ అనే యువతి అనుమానస్పదంగా మృతి చెందింది...

యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్: వికారాబాద్ జిల్లాకు చెందిన రమ్యకృష్ణ అనే యువతి అనుమానస్పదంగా మృతి చెందింది. గోపి, రమ్యకృష్ణలు ఇద్దరు సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగులు. వీరికి ఇద్దరు పిల్లలు (కవలలు) ఉన్నారు. నిన్న సాయంత్రం బంధువుల ఇంటికి పిల్లలను గోపి తీసుకు వెళ్లాడు. ఉదయం గోపి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య శవమై కనిపించింది. గోపి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఒంటరిగా ఫీల్ అవుతున్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు ఎవరు కారణం కాదని రమ్యకృష్ణ రాసుకున్న డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-03T21:04:21+05:30 IST