లక్ష్మీపురం కాళికాదేవి ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-05-17T05:03:28+05:30 IST

రామకుప్పం మండలం బల్ల పంచాయతీ లక్ష్మీపురం సమీపంలోని కాళికాదేవి ఆలయంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.

లక్ష్మీపురం కాళికాదేవి ఆలయంలో చోరీ

అమ్మవారి తాళిబొట్టు, రూ.2000 నగదు అపహరణ 


రామకుప్పం, మే 16: రామకుప్పం మండలం బల్ల పంచాయతీ లక్ష్మీపురం సమీపంలోని కాళికాదేవి ఆలయంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రామకుప్పం ఎస్‌ఐ క్రిష్ణయ్య కథనం మేరకు వివరాలు.. లక్ష్మీపురం సమీపంలోని కాళికాదేవి ఆలయ పూజారి చిన్నతంబి శనివారం సాయంత్రం అమ్మవారికి పూజలు చేసి ఆలయాన్ని మూసి ఇంటికి వెళ్ళిపోయారు. ఆదివారం ఉదయం యథావిధిగా చిన్నతంబి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్ళగా ఆలయ తలుపులు పగులగొట్టి ఉండటం గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి తాళిబొట్టుతో పాటు హుండీపగిలిపోయి అందులోని సుమారు రూ.2000 చోరీకి గురైనట్టు గుర్తించారు. చిన్నతంబి పిర్యాదు మేరకు రామకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-05-17T05:03:28+05:30 IST