HYD : వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. దొంగ ఎవరంటే..!
ABN , First Publish Date - 2021-11-20T13:51:13+05:30 IST
ఆర్జున్ భార్య సబితకు ఫోన్చేసి టేబుల్పై డబ్బులు ఉన్నాయని...
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్ : పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ చేసిన పని మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్లోని నలందనగర్ కాలనీ కర్ణి తామర అపార్ట్మెంట్ ప్లాట్నెంబర్ 312లో అర్జున్ అనే వ్యాపారి కుటుంబం ఉంటోంది. అతనికి బహదూర్పురాలో ఓ ఫ్యాక్టరీ ఉంది. బుధవారం ప్యాక్టరీ నుంచి రూ.3,60,650ను తీసుకొచ్చి ఇంట్లో టేబుల్పై పెట్టాడు. గురువారం మరిచిపోయి కంపెనీకి వెళ్లిపోయాడు. తర్వాత ఆర్జున్ భార్య సబితకు ఫోన్చేసి టేబుల్పై డబ్బులు ఉన్నాయని, భద్ర పరచాలని ఫోన్ చేసి చెప్పాడు.
కానీ ఆమెకు బ్యాగ్ కనిపించలేదు. అదే విషయాన్ని భర్తకు చెప్పింది. పనిమనిషి నేనావత్ లక్ష్మి అలియాస్ మనీబాయ్తోపాటు అర్జున్ కుమారుడుకి ట్యూషన్ చెప్పడానికి ఓ మాస్టర్ మాత్రమే వారి ఇంటికి వస్తారు. అర్జున్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న డీఐ పవన్కుమార్ బృందంవిచారణ చేపట్టగా, డబ్బును పనిమనిషి తీసినట్లు తేలింది. ఆమె నుంచి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని శుక్రవారం రిమాండ్కు తరలించారు. 24గంటల్లోగా కేసును ఛేదించిన పోలీసులను రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ అభినందించారు.