గృహంలో చోరీ

ABN , First Publish Date - 2020-12-04T05:13:31+05:30 IST

తాళం వేసిన ఓ గృహంలో దొంగలు పడి 15 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరించిన ఘటన మండలంలోని కందులాపురం పంచాయతీ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

గృహంలో చోరీ
వేలిముద్రలు సేకరిస్తున్న క్లూస్‌ టీమ్‌

15 తులాల బంగారు, 2 లక్షల నగదు చోరీ

కంభం, డిసెంబరు 3 : తాళం వేసిన ఓ గృహంలో దొంగలు పడి 15 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరించిన ఘటన మండలంలోని కందులాపురం పంచాయతీ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు పెద్దిరెడ్డి నరేంద్రరెడ్డి కథనం మేరకు తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి బుధవారం మంత్రాలయం వెళ్లాడు. ఇది గమనించిన దుండగులు తాళాలు పగులగొట్టి బీరువాలో దాచిన బంగారం నగదు అపహరించినట్లు తెలిపాడు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి బాధితునికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన మంత్రాలయం నుంచి వచ్చి చూసి వివరాలను పోలీసులకు తెలిపారు. దొంగలు మరో గదిలో ఉన్న ఇనుప బీరువాను తెరిచేందుకు ప్రయత్నించగా చేతకాక దొంగలు వెళ్ళిపోయినట్లు తెలిసింది. ఆ బీరువాలో అధిక మొత్తంలో బంగారం నగదు ఉన్నట్లు బాధితుడు పోలీసులకు వివరించారు.  ఒంగోలు నుంచి క్లూస్‌ టీం వేలిముద్రలను సేకరించింది. కంభం ఎస్సై మాధవరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-12-04T05:13:31+05:30 IST