శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి చోరీ

ABN , First Publish Date - 2021-04-05T12:21:10+05:30 IST

ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శుభకార్యం కోసం బెంగళూరు వెళ్లి

శుభకార్యానికి వెళ్లొచ్చేసరికి చోరీ

  • 20 తులాల బంగారం..
  • 10 తులాల వెండి తీసుకెళ్లిన దొంగలు 

హైదరాబాద్/జవహర్‌నగర్‌ : ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి శుభకార్యం కోసం బెంగళూరు వెళ్లి, తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న 20 తులాల బంగారం, 10 తులాల వెండి దోచుకెళ్లా రు. యాప్రాల్‌లోని శైలి గార్డెన్‌లో నివాసముంటున్న హరి సముద్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. మార్చి 30 బెంగళూరుకు వెళ్లాడు. ఏప్రిల్‌ 3న సోదరిని తీసుకుని వచ్చాడు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా, బంగారం, వెండి కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-05T12:21:10+05:30 IST