కర్నూలు బలుగోటేశ్వర దేవాలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-03-22T15:25:38+05:30 IST

జిల్లాలోని ప్రఖ్యాత దేవాలయంలో చోరీ జరిగింది. హాలహర్వి

కర్నూలు బలుగోటేశ్వర దేవాలయంలో చోరీ

కర్నూలు: జిల్లాలోని ప్రఖ్యాత దేవాలయంలో చోరీ జరిగింది. హాలహర్వి మండలంలోని విరుపాపురం గ్రామంలో ఉన్న బలుగోటేశ్వర దేవాలయంలో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. నాలుగు హుండీలలో ఉన్న నగదును లూటీ చేశారు. హుండీలలో ఉన్న సుమారు రూ. 3 లక్షల నగదు, 20 కేజీల వెండి, 20 తులాల బంగారాన్ని దుండుగులు ఎత్తుకెళ్లారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-03-22T15:25:38+05:30 IST