కరోనా మృతురాలి నుంచి 3 సవర్ల గాజులు చోరీ

ABN , First Publish Date - 2020-08-05T16:28:38+05:30 IST

కరోనా మృతురాలి నుంచి 3 సవర్ల గాజులు చోరీ

కరోనా మృతురాలి నుంచి 3 సవర్ల గాజులు చోరీ

చెన్నై: తమిళనాడులో కరోనా లక్షణాలతో మృతిచెందిన మహిళ వద్ద 3 సవర్ల గాజులు చోరీ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఉక్కడంకు చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కోయంబత్తూర్‌ ప్రభుత్వ వైద్యకళాశాలలో కరోనాతో చేరింది. బాధితురాలితో పాటు ఆమె కుమార్తె కూడా వెంట ఉన్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఆమె పరిస్థితి సాధారణంగా ఉన్నా, అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొని 4 గంటలకు మృతిచెందింది. ఆస్పత్రి నుంచి మృత దేహాన్ని తీసుకెళ్లేందుకు అవసరమైన దస్తావేజుల కోసం కుమార్తె వార్డు నుంచి బయటకు వచ్చిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి మృతురాలి చేతికి ఉన్న 3 సవర్ల బంగారు గాజును దొంగిలించి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో ఆస్పత్రి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-08-05T16:28:38+05:30 IST