దొంగల ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2021-06-18T05:36:56+05:30 IST

అర్థరాత్రి చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను వాల్మీకిపురం పోలీసులు అరెస్టు చేశారు.

దొంగల ముఠా అరెస్టు
స్వాధీనం చేసుకున్న బంగారం చూపుతున్న పోలీసులు

పావు కిలో బంగారం స్వాధీనం 

వాల్మీకిపురం, జూన్‌ 17: అర్థరాత్రి చోరీలకు పాల్పడిన దొంగల ముఠాను వాల్మీకిపురం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు. కొన్నినెలలుగా  వాల్మీకిపురంలోని తిరుపతి రోడ్డు, కలికిరి, నిమ్మనపల్లెలో అర్ధరాత్రి ఇళ్లలో చోరీలు జరిగాయి. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ధర్మవరం  పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్‌రామాంజులు(21), కె.శ్రీనివాస్‌(21), ఎన్‌.దినకర్‌(35)గా గుర్తించారు. వీరు బుధవారం సాయంత్రం మదనపల్లె -తిరుపతి రోడ్డులో ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి అరెస్టు చేశారు. వారినుంచి 250గ్రాముల బంగారం, 40 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారయ్యాడు. నిందితులను కోర్టుకు తరలించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది మోహన్‌బాబు, ఆలీ, కుమార్‌రెడ్డి, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:36:56+05:30 IST