‘క్విట్‌ ఇండియా’ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-08-05T10:42:30+05:30 IST

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఈనెల 9న నిర్వహించనున్న క్విట్‌ ఇండియా మూమెంట్‌ ఉద్యమాన్ని విజయవంతం ..

‘క్విట్‌ ఇండియా’ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి

గుజరాతీపేట: వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఈనెల 9న నిర్వహించనున్న క్విట్‌ ఇండియా మూమెంట్‌ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత రైతు పోరాటం సమన్వయ కమిటీ జిల్లా నాయకులు తాండ్ర ప్రకాష్‌, బుడితి అప్పలనాయుడులు కోరారు.  మంగళవారం ఏఐకేఎస్‌సీసీ జాతీయ నాయకులు వీఎం సింగ్‌, మేఽథాపట్కర్‌, ఆశీస్‌ మిట్టల్‌, రావుల వెంకయ్య, వెంకట్రామయ్య, వడ్డే శోభనాద్రేశ్వరరావు సారథ్యంలో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన సభలో వారు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మూడు ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని కిట్‌ ఇండియా మూమెంట్‌ ఉద్యమాన్ని  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-08-05T10:42:30+05:30 IST