కరోనా కేసుల కన్నా ప్రతిపక్షాలపై పెడుతున్న కేసులే ఎక్కువ
ABN , First Publish Date - 2021-05-14T08:59:57+05:30 IST
‘‘రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల కన్నా ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి గుంటూరులో ఒక పోలీస్స్టేషన్కు వెళ్ళిన టీడీపీ నేతలపై
ఫిర్యాదు చేయడానికి వెళ్తే కేసా?: అచ్చెన్న
అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల కన్నా ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి గుంటూరులో ఒక పోలీస్స్టేషన్కు వెళ్ళిన టీడీపీ నేతలపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేయడం దారుణం. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు మున్ముందు వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు.