వెనుకడుగు వేసేది లేదు

ABN , First Publish Date - 2022-09-08T09:13:08+05:30 IST

వెనుకడుగు వేసేది లేదు

వెనుకడుగు వేసేది లేదు

నిరుద్యోగ రణంలో శ్రీరాం చినబాబు


విజయనగరం, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘నిరుద్యోగ రణం కార్యక్రమానికి పాలకులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. అయినా వెనుకడుగు వేసేది లేదు’’ అని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, ఏటా జాబ్‌ కేలెండర్‌ విడుదల చేస్తామన్న హామీని అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తెలుగు యువత నిరుద్యోగ రణం కార్యక్రమాన్ని బుధవారం చేపట్టింది. విజయనగరంలో కిలోమీటరన్నర మేర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని టీడీపీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతిరాజు ప్రారంభించారు. శ్రీరాం చినబాబు మాట్లాడుతూ...ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడేళ్ల కాలంలో నిరుద్యోగులను నట్టేట ముంచారన్నారు. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-09-08T09:13:08+05:30 IST