ఇసుక కొరత రాకూడదు : జేసీ

ABN , First Publish Date - 2021-06-24T04:59:53+05:30 IST

పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చర్య లు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు.

ఇసుక కొరత రాకూడదు : జేసీ
మాట్లాడుతున్న జేసీలు ఎం.గౌతమి, ధ్యాన్‌చంద్ర

కడప(కలెక్టరేట్‌) జూన్‌ 23. పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చర్య లు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో జేసీ ధ్యాన్‌చంద్ర, గనులు, భూగర్భ శాఖాధికారులు, జిల్లా ఇసుక అధికారులు, జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పేదల ఇళ్ల నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా సరఫరా చేసేందుకు జయప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా 5 లక్షల టన్నుల ఇసుకను డిపోలలో సిద్ధం చేయాలని తెలిపారు. అనంతరం జేసీ ధ్యాన్‌చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన లేఔట్ల నుంచి 40 కిలోమీటర్ల లోపు ఉన్న ఇసుక రీచ్‌ల నుంచి లబ్ధిదారులే ఇసుకను తెచ్చుకోవాలన్నారు. 40 కిలోమీటర్లు మించి దూరంగా ఉంటే కంపెనీ వారు లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఇసుక సరఫరా చేయాలన్నారు.

Updated Date - 2021-06-24T04:59:53+05:30 IST