యాష్‌ టెండర్లలో అన్యాయం

ABN , First Publish Date - 2021-05-11T06:21:26+05:30 IST

యాష్‌ టెండర్లలో అన్యాయం

యాష్‌ టెండర్లలో అన్యాయం

చెల్పూరు, మే 10: కేటీపీపీ నుంచి వెలువడే యాష్‌ టెండర్‌ కేటాయింపులో తమకు తీరని అన్యాయం జరుగుతోందని కేటీపీపీ ఫ్లైయాష్‌ యజమానులు  ఆవేదన వ్యక్తం చేశారు.  సీఈని కలవడానికి వెళ్లగా తమను లోనికి అనుమతించడం లేదని అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీపతి సదానందం తెలిపారు.  ప్లాంటు ప్రారంభం నుంచి స్థానికంగా ఉన్న కుటుంబాలు యాష్‌ తరలింపు ఉపాధి పైనే ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే విషయంపై తమ  బాధలు చెప్పుకోవడానికి చీఫ్‌ ఇంజనీర్‌ వద్దకు వెళ్లడానికి  ప్రయత్నించగా సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో  వైస్‌ ప్రెసిడెంట్‌ పొన్నం రమేష్‌, జనరల్‌ సెక్రటరీ రమణారెడ్డి,  జాయింట్‌ సెక్రటరీ రాజేశ్వర్‌రావు, సభ్యులు మొకిరాల తిరుపతిరావు, శ్రీనివాసరావు, రవిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-11T06:21:26+05:30 IST