అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగ
ABN , First Publish Date - 2020-12-03T05:27:06+05:30 IST
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడ్డ దొంగ
- అప్రమత్తమైన కాలనీ వాసులు
- పట్టుకున్న పోలీసులు
షాద్నగర్ రూరల్: అర్ధరాత్రి ఓ దొంగ ఇంట్లో చోరీకి పాల్పడుతున్న సమయంలో అలికిడి విని చుట్టుపక్కల వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకుని దొంగను పట్టుకున్న సంఘటన షాద్నగర్ పట్టణంలోని రైతు కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ అంబర్పేటకు చెందిన విజయ్కుమార్ అనే యువకుడు మంగళవారం అర్ధరాత్రి మోటార్ సైకిల్పై షాద్నగర్ చేరుకున్నాడు. పట్టణంలోని రైతుకాలనీకి చెందిన కొమ్మగంటి జగన్గౌడ్ మంగళవారం సాయ ంత్రం 4.30గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి కేశంపేట మండలంలోని అత్తగారింటికి వెళ్లాడు. ఇంటికి తాళాన్ని గమనించిన విజయ్కుమార్ దాన్ని పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా విరగ్గొడుతుండగా అదే ఇంట్లో మరో పక్క అద్దెకుంటున్న అంబటి శివకుమార్కు అలికిడి విని తలుపు దగ్గరికి వచ్చి చూశాడు. బయటి గొల్లెం విరగ్గొట్టి ఉండటంతో జగన్గౌడ్ ఇంట్లో దొంగలు పడినట్టు అనుమానం వచ్చి వెంటనే షాద్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్కు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన శ్రీధర్కుమార్ వెంటనే బ్లూ కోట్స్ పోలీసులను అక్కడికి పంపించారు. అప్పటికే అక్కడ కాలనీ వాసులు గుమికూడారు. పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి దొంగను పట్టుకున్నారు. దొంగతనానికి యత్నించిన విజయ్కుమార్ను పోలీ్సస్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
సమాచారం ఇచ్చిన యువకుడికి సన్మానం
షాద్నగర్లోని ఇంట్లో దొంగలు పడ్డట్టు అనుమానించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చిన శివకుమార్ను ఇన్స్పెక్టర్ శ్రీధర్కుమార్ సన్మానించారు. శివకుమార్ను అందరూ ఆదర్శంగా తీసుకుని నేరాల నియ ంత్రణకు సహకరించాలని ఆయన కోరారు.