దొంగ అరెస్టు: డీఎస్పీ
ABN , First Publish Date - 2022-01-29T05:54:09+05:30 IST
జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ సోమనాథం అన్నారు.
కామారెడ్డి, జనవరి 28: జిల్లాలోని రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారించగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ సోమనాథం అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 12న ఆర్గొండ గ్రామానికి చెందిన చాకలి ఎల్లయ్య ఇంట్లో దొంగతనం జరగగా రాజంపేట పోలీసులు దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన చాకలి శ్రీకాంత్ను విచారించగా తన చిన్న య్య చాకలి ఎల్లయ్య ఇంట్లో చోరీకి పాల్పడట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. అరతులం బంగారు నగలు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. రాజంపేట ఎస్ఐ రాజు పోలీసు సిబ్బంది ఏఎస్ఐ గంగారెడ్డి, కానిస్టేబుల్ లక్ష్మీకాంత్ సొమ్మును రికవరీ చేశారు. రాజంపేట ఎస్ఐ రాజును డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో భిక్కనూర్ సీఐ తిరుపతయ్య, ఎస్ఐ రాజు, పోలీసు సిబ్బంది గంగారెడ్డి, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.