నర్సు ఫోన్‌ చోరీ.. అందులో ఆమె అశ్లీల ఫొటోల్ని చూసి నేరుగా భర్తకు ఫోన్.. దారుణ నిజాలు చెప్పి మరీ..

ABN , First Publish Date - 2021-07-11T02:23:22+05:30 IST

పేషెంట్‌కు సేవ చేయడంలో మునిగి మొబైల్ చోరీ అవడం గమనించలేదా నర్సు. ఆ తర్వాతి పరిణామాలు ఆమె జీవితం బజారుపాలయ్యేలా చేశాయి.

నర్సు ఫోన్‌ చోరీ.. అందులో ఆమె అశ్లీల ఫొటోల్ని చూసి నేరుగా భర్తకు ఫోన్.. దారుణ నిజాలు చెప్పి మరీ..

ఇంటర్నెట్ డెస్క్: పేషెంట్‌కు సేవ చేయడంలో మునిగి మొబైల్ చోరీ అవడం గమనించలేదా నర్సు. ఆ తర్వాతి పరిణామాలు ఆమె జీవితం బజారుపాలయ్యేలా చేశాయి. కుటుంబం ఆమెను ఇంటి నుంచి బయటకు తరిమేసేలా ఉంది. ప్రస్తుతం ఆ కుటుంబం రణరంగాన్ని తలపిస్తోంది. కుటుంబ సభ్యులందరి నుంచి అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రిలో సదరు నర్సు పనిచేస్తోంది. అక్కడ మే 2న ఒక పేషెంట్ రావడంతో పనిలో ఉండగా.. ఆమె మొబైల్‌ను ఎవరో చోరీ చేశారు.



చోరీ తర్వాతే అసలు కథ..

ఎంతగా గాలించినా తన మొబైల్ దొరక్కపోవంతో ఆమె దాన్ని వదిలేసుకుంది. అలాంటి సమయంలో చోరీ జరిగిన రెండ్రోజుల తర్వాత ఆమె భర్తకు ఆమె మొబైల్ నుంచి ఫోన్ వచ్చింది. ‘‘మీ భార్య ఫోన్లో కొన్ని అసభ్యకరమైన ఫొటోలు ఉన్నాయి. ఆస్పత్రిలో ఎవరితోనో కలిసి ఉన్న అశ్లీల వీడియోలు కూడా కనిపించాయి. వాటన్నింటినీ పంపుతా చూడు’’ అంటూ ఆ దొంగ ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలతో షాకైన ఆ భర్తకు మరింత దిమ్మతిరిగేలా.. ఆ ఫొటోలు, వీడియోలను ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేశాడా చోరుడు. ఆ గ్రూప్‌లో లేని కుటుంబీకులకు పర్సనల్‌గా వాటిని పంపాడు. దీంతో ఆ కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇంతకాలం తనతో ఉన్న భార్య ఇలాంటిదా? అంటూ భర్త.. చుట్టాలు అందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఫొటోలు మార్ఫించే చేసినవంటూ సదరు నర్సు మహారాజపురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Updated Date - 2021-07-11T02:23:22+05:30 IST