అమెరికాలో మరో పోలీసు ఆత్మహత్య.. ఇతనూ యూఎస్ కాపిటోల్ దాడి బాధితుడే!
ABN , First Publish Date - 2021-08-03T10:54:14+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ కాపిటొల్ హిల్పై జరిగిన దాడిని ఎవరూ మర్చిపోలేరు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది ఆరంభంలో యూఎస్ కాపిటొల్ హిల్పై జరిగిన దాడిని ఎవరూ మర్చిపోలేరు. ఈ కేసుపై విచారణ సందర్భంగా ఇటీవలే నలుగరు పోలీసు అధికారులు కన్నీటిపర్యంతమైన ఘటన గుర్తుంది కదా. అది మరువక ముందే కాపిటోల్ దాడికి సంబంధించిన మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని ఎదుర్కొన్న పోలీసు అధికారుల్లో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే ఈ దాడితో సంబంధం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులు ఆత్మహత్య చేసుకోగా, ఇప్పుడు తాజాగా మూడో పోలీసు అధికారి సూసైడ్ చేసుకున్నాడు. వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్కు చెందిన గంథర్ హషీడా (43) అనే పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. హషీడా కుటుంబం కోసం గోఫండ్మీ క్యాంపెయిన్ నడుస్తోంది. కాగా, యూఎస్ కాపిటోల్ దాడి జరిగిన మూడో రోజున హోవర్డ్ లీబెన్గుడ్ అనే అధికారి ఆత్మహత్య చేసుకోగా, జనవరి 15న జెఫ్రీ స్మిత్ అనే అధికారి తనను తాను కాల్చుకొని ప్రాణాలు వదిలాడు.