ప్రారంభమైన మూడో విడత వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-03-02T06:11:11+05:30 IST
కొవిడ్ మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారభించినట్లు డీఎంహెచ్వో పెంచలయ్య తెలిపారు.
60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్ల లోపు దీర్ఘకాలిక రోగులు అర్హులు
చిత్తూరు రూరల్, మార్చి 1: కొవిడ్ మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారభించినట్లు డీఎంహెచ్వో పెంచలయ్య తెలిపారు. మూడో విడతలో 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్ల లోపు దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం అర్హులైన వారు ఛిౌఠీజీుఽ.జౌఠి.జీుఽ వెబ్సైట్లో కాని, ఆరోగ్య సేతు యాప్ ద్వారా కాని పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ముందుగా లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మెబైల్ నెంబరు ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది ఆపై ఐడీ ఫ్రూఫ్, పేరు, ఇతర వివరాలను నమోదు చేయాలన్నారు. వెబ్సైట్, యాప్ద్వారా నమోదు చేసుకోవడం తెలియని వారు మీ సేవా కేంద్రాల్లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చునన్నారు. 60 సంవత్సరాలు నిండిన వారు, రిటైడ్ ఉద్యోగులు, 45 సంవత్సరాలు పైబడి మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, గుండెజబ్బులు ఇతర రోగాలున్నవారు అర్హులన్నారు. వ్యాక్సిన్ అనంతరం కూడా మాస్కులు, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని ఆయన వెల్లడించారు.