సిడ్నీ..డ్రా దిశగా మూడో టెస్ట్

ABN , First Publish Date - 2021-01-11T17:10:52+05:30 IST

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మూడో టెస్ట్ డ్రా దిశగా కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‎లో ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేక్రమంలో టాప్ ఆర్డర్ కీలక...

సిడ్నీ..డ్రా దిశగా మూడో టెస్ట్

సిడ్నీ: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగుతున్న మూడో టెస్ట్ డ్రా దిశగా వెళుతోంది. రెండో ఇన్నింగ్స్‎లో ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా కీలక వికెట్లను కోల్పోయింది. 272 పరుగులకు ఐదు వికెట్లను కోల్పోవడంతో.. భారత జట్టు కష్టాల్లో పడింది. దీంతో మిగతా బ్యాట్స్‎మెన్స్ ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో ఉన్న హనుమ విహారి 112 బంతులు ఆడి కేవలం 7 పరుగులు మాత్రమే చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ 91 బంతులు ఆడి 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. ఇంకా టీమిండియా గెలవాలంటే 15 ఓవర్లలో 102 పరుగులు చేయాల్సింది. ఆస్ట్రేలియా జట్టు విజయాన్ని సొంతం చేసుకోవాలంటే ఐదు వికెట్లను తీయాల్సిఉంది.

Updated Date - 2021-01-11T17:10:52+05:30 IST