గడికారేంలో దాహంకేకలు
ABN , First Publish Date - 2021-10-15T05:00:12+05:30 IST
మండలంలోని దుగ్గి పంచాయతీ పరిధిలో గల గడికారేంలో గిరిజ నులు తాగునీటికి అల్లాడుతున్నారు.
సీతంపేట:మండలంలోని దుగ్గి పంచాయతీ పరిధిలో గల గడికారేంలో గిరిజ నులు తాగునీటికి అల్లాడుతున్నారు.గ్రామంలో 70 గిరిజన కుటుంబాలు నివసిస్తు న్నాయి. రక్షిత మంచినీటి ట్యాంక్ను ఏర్పాటుచేసినా, పైపులు పాడవడంతో నీరు ట్యాంకులోకి వెళ్లడంలేదని గ్రామస్థులు సీతారాం, కొండగొర్రి రమేష్ తదితరులు తెలిపారు. రహదారి అధ్వానంగా ఉండడంతో బోరు ఏర్పాటుకు లారీ కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక కలుషితమైన బావినీటిని తాగాల్సివస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. దీంతో అనారోగ్యం పాలవుతున్నామని చెబుతున్నారు.