శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

ABN , First Publish Date - 2020-03-26T09:05:22+05:30 IST

శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శార్వరినామ సంవత్సర ఉగా ది ఆస్థానాన్ని అర్చకులు శా స్ర్తోక్తంగా నిర్వహించారు. బంగారువాకిలి ...

శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శార్వరినామ సంవత్సర ఉగా ది ఆస్థానాన్ని అర్చకులు శా స్ర్తోక్తంగా నిర్వహించారు. బంగారువాకిలి చెంత ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ ఈ కార్యక్రమం చేపట్టారు. ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించి అనంతరం శుద్ధి చేశారు. తర్వాత 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ నిర్వహించారు. 7- 9 గంటల మధ్య ఉత్సవర్లను సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పీఠంపై విష్వక్సేనులను ఆశీనులను గావించారు. అనంతరం జియ్యంగార్లు, అర్చకులు, అధికారులు నూతన వస్త్రాలను బంగారువాకిలి వద్దకు తెచ్చి మూలవిరాట్టుకు, ఉత్సవర్లకు అలంకరించారు. 

Updated Date - 2020-03-26T09:05:22+05:30 IST