thirumala: జూలైలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 55.55 కోట్లు
ABN , First Publish Date - 2021-08-01T13:29:06+05:30 IST
కరోనా సెకండ్ వేవ్ కారణంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఇక జూలై నెలలో ...
తిరుమల: కరోనా సెకండ్ వేవ్ కారణంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఇక జూలై నెలలో కాస్త భక్తుల సంఖ్య పెరిగింది. ఒక జూలైలోనే శ్రీవారిని 5,32,780 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. జూలైలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం రూ. 55.55 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలిపారు. 2,55,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.