ఆక్సిజన్ ప్లాంట్లు, ఆస్పత్రులు సిద్ధం చేస్తాం: మోదీ

ABN , First Publish Date - 2021-04-21T02:27:14+05:30 IST

ఆక్సిజన్ ప్లాంట్లు, ఆస్పత్రులు సిద్ధం చేస్తాం: మోదీ

ఆక్సిజన్ ప్లాంట్లు, ఆస్పత్రులు సిద్ధం చేస్తాం: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ జాతి నుద్దేశించి ప్రసంగించారు. కరోనా మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. కోవిడ్ వారియర్స్‌కు ప్రధాని మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుడిగా తాను కూడా ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. కరోనాపై మరోసారి అతి పెద్ద యుద్ధం చేస్తున్నామంటూ సెకండ్ వేవ్ ఇప్పుడు అతి పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అందరం కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు. దేశం నలుమూలల ఆక్సిజన్ కొరత ఉందన్నారు. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొత్త ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు కోవిడ్ ఆస్పత్రులను కూడా నిర్మిస్తామన్నారు. సమష్టి పోరాటంతో కరోనాపై విజయం సాధిస్తామన్నారు. 


Updated Date - 2021-04-21T02:27:14+05:30 IST