నా చేతిలో ఏమీ లేదు.. బాలినేనిని కలవండి..!

ABN , First Publish Date - 2021-05-07T06:56:29+05:30 IST

మండల ప్రజాపరిషత్‌ ఉపాధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించడం తన చేతిలో లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవాలని వైసీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మాదాసి వెంకయ్య తెలిపారు.

నా చేతిలో ఏమీ లేదు.. బాలినేనిని కలవండి..!

ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంపై మైనార్టీతో వెంకయ్య

ఆగ్రహం ముస్లిం మైనార్టీలు

సింగరాయకొండ, మే 6 :  మండల ప్రజాపరిషత్‌ ఉపాధ్యక్ష పదవిని మైనార్టీలకు కేటాయించడం తన చేతిలో లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలవాలని వైసీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మాదాసి వెంకయ్య తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు  ముస్లిం మైనార్టీలకే ఇవ్వాలని పలువురు మండల మైనార్టీ నాయకులు  వెంకయ్యను గురువారం కలిశారు.  ఈ సందర్బంగా వెంకయ్య ఉపాధ్యక్ష పదవి కేటాయింపు తనచేతుల్లో లేదని వారికి చెప్పినట్లు తెలిసింది.   దీనిపై మంత్రి బాలినేనిని కలవాలని సూచించినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. దీంతో అసంతృప్తితో మైనార్టీ నాయకులు వెనుదిరిగారు. రాజకీయంగా మైనార్టీలను వాడుకొని పదువుల కేటాయింపు విషయంలో అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు. దీంతో ఉపాధ్య పదవిని ఆశిస్తున్న మైనార్టీల్లో నైరాశ్యం నెలకొంది. పట్టణ వైసీపీ కన్వీనర్‌ షేక్‌ పటేల్‌ ఆధ్వర్యంలో ముస్లిం నేతలు వెంకయ్యను కలిశారు.

Updated Date - 2021-05-07T06:56:29+05:30 IST