మోదీ మన ప్రధాని... అలా చేయకూడదు : రాహుల్

ABN , First Publish Date - 2020-10-28T20:39:20+05:30 IST

బిహార్ యువతకు ఉద్యోగ, ఉపాధి లభించడం లేదని, ఎందుకుంటే సీఎం నితీశ్ అత్యంత బలహీనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.

మోదీ మన ప్రధాని... అలా చేయకూడదు  : రాహుల్

పాట్నా : దసరా ఉత్సవం సందర్భంగా మోదీ దిష్టి బొమ్మలు కాల్చడం చూసి ఆశ్చర్యపోయామని, ఇది చాలా విచారకరమని అన్నారు. మోదీ దేశ ప్రధాని అని, చాలా చేయకూడదని కాంగ్రెస్ ఎంపీ హితవు పలికారు. బిహార్ యువతకు ఉద్యోగ, ఉపాధి లభించడం లేదని, ఎందుకుంటే సీఎం నితీశ్ అత్యంత బలహీనంగా ఉన్నారని విమర్శించారు. ఉద్యోగాలను కల్పిస్తామని వాగ్దానాలు చేస్తారని, కానీ వాటిని నెరవేర్చని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చంపారన్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. దేశంలో లాక్‌డౌన్ విధించడం, పెద్ద నోట్ల రద్దు.. రెండూ ఒకే లక్ష్యాలతో కూడుకున్నవని, చిన్న వ్యాపారులను దెబ్బ తీయడమే వీటి లక్ష్యమని రాహుల్ ఆరోపించారు. చిన్న వ్యాపారులను తుడిచిపెట్టేసే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని, లాక్‌డౌన్ కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారని అన్నారు.


బిహార్ శక్తిని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని, గాంధీజీ కూడా స్వాతంత్ర్యోద్యమాన్ని చంపారన్ నుంచే ప్రారంభించారని రాహుల్ గుర్తు చేశారు. గతంలో మోదీ పర్యటించిన సందర్భంలో చక్కెర ఫ్యాక్టరీని నెలకొల్పి, ఛాయ్ తాగుతామని మోదీ ప్రకటించారని, ఇప్పటి వరకూ మోదీ చాయ్ తాగారా? అని సూటిగా ప్రశ్నించారు.  ఈ రోజుల్లో ఉద్యోగాల కల్పనపై ప్రధాని మోదీ ప్రకటనలివ్వరని, ఎందుకంటే ఆయన మాటలను నమ్మే స్థితిలో బిహార్ ప్రజలు లేరని రాహుల్ ఎద్దేవా చేశారు. 


Updated Date - 2020-10-28T20:39:20+05:30 IST