మొదటి ప్యాసింజర్ రైలు ఇది!
ABN , First Publish Date - 2021-09-02T07:25:00+05:30 IST
ఇప్పుడు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే రైళ్లను చూసుంటారు. మరి రైలు ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైందో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఇంగ్లండ్లోని స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్కు ప్రయాణించింది.
ఇప్పుడు బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే రైళ్లను చూసుంటారు. మరి రైలు ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైందో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు ఇంగ్లండ్లోని స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్కు ప్రయాణించింది. కిల్లింగ్వర్త్ కొలిరీలో జరిగే పనుల కోసం జార్జ్ స్టీఫెన్సన్ అనే వ్యక్తి స్టీమ్ ఇంజన్స్ తయారుచేసి ఇచ్చేవాడు. అతను తయారుచేసిన ఇంజన్తోనే మొదటి రైలు 1825 సెప్టెంబర్ 27న స్టాక్టన్ నుంచి డార్లింగ్టన్కు ప్రయాణికులను తీసుకుని గంటకు 24 కి.మీ వేగంతో ప్రయాణించింది. అప్పటి నుంచి రైల్వేలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.