ఎన్టీఆర్ను నేరుగా చూడ్డాం అదే మొదటిసారి: నటి రాజశ్రీ
ABN , First Publish Date - 2020-05-28T16:55:45+05:30 IST
ప్రపంచంలో అత్యధికంగా జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించిన ఘనత ఎన్టీఆర్దే.
చెన్నై: ప్రపంచంలో అత్యధికంగా జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించిన ఘనత ఎన్టీఆర్దే. ఆయన సరసన అనేక జానపదాల్లో నాయికగా రాజశ్రీ మురింపించారు. చెన్నై నుంచి రాజశ్రీ.. నందమూరి తారక రామునితో తన మధుర స్మృతులను పంచుకున్నారు. ‘‘నేను రామారావుగారు పిక్చర్లు చాలా చూశాను. రాముడిగా, కృష్ణుడిగా రకాల వేశాల్లో చూశాను. కానీ ఫస్ట్ టైమ్ దక్షయజ్ఞం పిక్చర్లో ఎస్వీరంగారావు, కన్నంబగారు వాళ్ల సినిమాలో రోహిణిగా నటించానని.. అందులో ఎన్టీఆర్ శివుడు. అంటే కైలాశంలో ప్రళయతాండం చేసినప్పుడు ఆయనను ఫస్ట్ టైమ్ చూశాను. ఆయన ఎంతబాగా డ్యాన్స్ చేస్తున్నారని అనుకున్నానని’’ అన్నారు. ఎన్టీఆర్ను నేరుగా చూడ్డం అదే మొదటిసారన్నారు.
అంతకుముందు ఎన్టీఆర్తో కలిసి నటించలేదని రాజశ్రీ తెలిపారు. దక్షయజ్ఞంలో ఆయనను మొదటిసారి చూశానన్నారు. శివుడు అంటే ఇలాగే ఉంటారేమోనని అనుకున్నానన్నారు. ఎన్టీఆర్ను చూసిన వెంటనే అంత ఆనందం కలిగిందన్నారు. రామారావుతో కలిసి చాలా సినిమాల్లో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చాలా చూశానన్నారు. ఆయనతో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్టీఆర్తో మొదటి సినిమా ‘అగ్గిపిడుగు’లో నిటించానన్నారు. ఆయనతో చాలా మంచి సినిమాల్లో నటించానని చెప్పారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉందని రాజశ్రీ అన్నారు.