కరోనా ఫేరెవెల్ పార్టీ.. హాజరైన వేలమంది.. ఎక్కడంటే?

ABN , First Publish Date - 2020-07-02T04:03:46+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య పెరిగిపోతోంది.

కరోనా ఫేరెవెల్ పార్టీ.. హాజరైన వేలమంది.. ఎక్కడంటే?

ప్రేగ్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. రోజురోజుకూ ఈ వైరస్ బారిన పడుతున్న వారిసంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో ఓ భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించారు కొందరు. ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు హాజరయ్యారు. ఇంతకీ ఆ కార్యక్రమం పేరేంటో తెలుసా? ‘కరోనా వైరస్ ఫేరెవెల్ పార్టీ’. ఈ పార్టీ ప్రేగ్‌లోని ప్రఖ్యాత చార్లెస్ బ్రిడ్జ్‌పై జరిగింది. సీజెక్ రిపబ్లిక్ దేశంలో లాక్‌డౌన్ నిబంధనలు తొలగించారు. ఇలా లాక్‌డౌన్ తొలగించి నెలరోజులు దాటింది. ఈ నేపథ్యంలో ఓంద్రేజ్ కోబ్జా అనే వ్యక్తి ఈ పార్టీ నిర్వహించాడు. స్థానికంగా ఉన్న ఓ కేఫే యజమాని అయిన కోబ్జా.. హాజరైన అతిథుల కోసం 500మీటర్ల పొడవైన టేబుల్ ఏర్పాటు చేశాడు. కరోనా ప్యాండెమిక్ అంతమైపోయిందని, అందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నానని కోబ్జా చెప్పినట్లు సమాచారం.

Updated Date - 2020-07-02T04:03:46+05:30 IST