బెదిరించి లైంగిక దాడి చేశాడు

ABN , First Publish Date - 2022-01-19T04:55:45+05:30 IST

తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చి.. తనను బెదిరించి లైంగిక చేశాడని, ఈ విషయం బయటకు చెబితే పెట్రోల్‌ పోసి చంపేస్తానని బెదిరించాడని,

బెదిరించి లైంగిక దాడి చేశాడు

 న్యాయం చేయాలంటూ ఓ యువతి ఆవేదన

  తొలుత అత్యాచారయత్నం చేశాడంటూ ఫిర్యాదు.. 

  కేసు నమోదు.. రిమాండ్‌కు తరలింపు

  అఘాయిత్యం చేశాడంటూ వీడియో ద్వారా వెల్లడి

  తిరుమలాయపాలెం మండలంలో ఘటన

తిరుమలాయపాలెం, జనవరి18: తాను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చి.. తనను బెదిరించి లైంగిక చేశాడని, ఈ విషయం బయటకు చెబితే పెట్రోల్‌ పోసి చంపేస్తానని బెదిరించాడని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన 23 ఏళ్ల ఓ యువతి సెల్ఫీవీడియోలో గోడు వెళ్లబోసుకుంది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. తాను డిసెంబరు 31న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన 27ఏళ్ల వయసున్న లంజపల్లి ఫిరోజ్‌గాంధీ అనే యువకుడు ఇంట్లోకి వచ్చి, తనపై అత్యాచారయత్నం చేశాడని అదే రోజున ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు. కాగా మంగళవారం ఆరోగ్యం బాగాలేదంటూ సదరు యువతి వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వచ్చి.. తనను ఆ యువకుడు బెదిరించి అత్యాచారం చేశాడని, బయటకు చెబితే చంపుతాని బెదరించాడని, అతని కుటుంబంనుంచి రక్షణ కలిపించాలని ఓ వీడియో ద్వారా కోరింది. అలాగే అతడి కుటుంబసభ్యులు పెట్రోల్‌ పోసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదుచేస్తే పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తంచేయడం చర్చనీ యాశంమైంది. అయితే ఈ విషయంపై తిరుమలా యంపాలెం ఎస్‌ఐ భవానీని వివరణ కోరగా ఫిరోజ్‌ గాంధీ తనపై అత్యాచారయత్నం చేశాడని ఆ యువతి డిసెంబరు 31న ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపామన్నారు.కానీ అత్యాచారం జరిగినట్టుగా తమకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని ఎస్‌ఐ వివరించారు. కాగా ఈసంఘటన విషయంలో గ్రామంలో ఇరువర్గాల మధ్య పంచాయితీ జరిగిందని, ఆ పంచాయతీలో ఏకా భిప్రాయం కుదరక పోవడంతోనే అత్యాచారం జరిగిందంటూ వీడియోను తెరపైకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 

Updated Date - 2022-01-19T04:55:45+05:30 IST